సంచికలో తాజాగా

డా. మహ్మద్ షరీఫ్ Articles 1

ప్రవృత్తి రీత్యా సాహితీవేత్త అయిన డా. మహ్మద్ షరీఫ్ విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు. వీరి తండ్రి గారు షేఖ్ ఇమామ్. షరీఫ్ గారి విద్యార్హతలు - ఎం.ఏ. (తెలుగు) ఎం.ఇడి. విషయ నిపుణుడిగా తెలంగాణ తొలి తెలుగు ప్రథమ, ద్వితీయ భాషా వాచకముల రూపకల్పనలో పాల్గొన్నారు. 'వ్యాఖ్యాన వతంస' బిరుదాంకితులు. డా. షరీఫ్ కవి, గాయకులు, వక్త, వ్యాఖ్యాత, రంగస్థల నటులు. సుమారు 200 సంకలనాలలో, వివిధ పత్రికలలో పద్య, గేయ, వచన, వ్యాస, కథలు ముద్రితమైనవి. ఉపధ్యాయునిగా, కవిగా విశిష్ట పురస్కారాలనెన్నిటినో పొందారు. అఖిల భారత తెలుగు సమాఖ్య విశాఖపట్నం వారి 'ప్రతిభారత్న' అవార్డు పొందారు. 1985 నుండి ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, అంతరాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలలో, సాహితీ గోష్ఠులలో అవధనాలలో పాల్గొన్నారు. రెండు తెలుగు మహాసభలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారు. 1. షరీఫుమాట వెలుగు బాట శతకము 2. సుజన శతకము 3. భరతవీర శతకము 4. పద్యమంజుష (సమస్యాపూరణలు) 5. గురుదేవోభవ (పద్యకావ్యం) వీరి ముద్రిత రచనలు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!