సంచికలో తాజాగా

డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి Articles 3

డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి విశాఖజిల్లా అనకాపల్లిలో 3.9.1954 న లక్ష్మీకాంతం, రాధాకృష్ణ దంపతులకు జన్మించారు. ఎం.కాం.,ఎం.ఫిల్.,పి.హెచ్.డి, హిందీ సాహిత్యరత్న విద్యార్హతలు. అనకాపల్లి వర్తకసంఘ లింగమూర్తి కళాశాల వాణిజ్యవిభాగంలో 1976 లో లెక్చరర్ గా ప్రవేశించి రీడర్‌గా పదోన్నతి పొంది 2012 సెప్టెంబర్‌లో శాఖాధిపతిగా పదవీవిరమణ. గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల అభిరుచి పెరిగింది వారి అన్నగారి వలన. 1970 నుంచి తన భావాలకు అక్షరరూపం యివ్వటం ప్రారంభించారు. ఆ ఆసక్తి కవితలు,గేయాలు రాయటానికి దోహదమైంది. అందరిలాగే ఆయననూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ప్రభావితం చేసిందని చెబుతారు. రంగుల చినుకులు, నెలవంక, కవచం పలుకే బంగారమాయే - కవితాసంపుటులు వెలువరించారు. ప్రస్తుతం కన్వీనర్, అనకాపల్లి సాహితీమిత్రులు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!