దేశ విభజన జరగగానే
మైనార్టీలైదు శాతము.
ఖండభారత అధిక సంఖ్యాకులు
తొంబయ్యైదు శాతము.
ఇపుడు మైనార్టీల సంఖ్య
ఇరవయ్యైదు శాతముంది.
అపుడు పాకిస్థానమున మై
నార్టీలు ముప్పదిశాతము.
ఇపుడు హిందు మైనార్టీలు
ఒకటిన్నర శాతమయ్య!
***
ఇతర దేశాల నుండి చొచ్చు
కొచ్చిన ముస్లిములే కోట్లు.
మతము మార్పిడి ద్వారా సంఖ్యను
పెంచుకుంటూ పంచుకొనిరి.
పౌరసత్వము చట్టమే పరి
హాసమాయెను మాయలోన.
ఓట్ల కోసము రాజకీయులు
దేశభక్తిని మరిచిపోయిరి.
మతమౌఢ్యమున్ ప్రోత్సహించిరి
దేశభవితను ఫణము పెట్టిరి.
***
పౌరసత్వము చట్టసవరణ
చేయుటయే అన్యాయమనుచును
ఉద్యమాలకు ఊపిరూదుచు
చట్టమే తమ చుట్టమనిరి.
ఒకే వర్గము మేధావులకు
తిరోగమనము తిక్కరేగ
చట్టసవరణ నష్టమేమిటో
చెప్పలేక పరుగులెత్తిరి
వేల కాశ్మీరు పండితులను
తరిమినప్పుడు ఏం చేసిరి?
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.