ఆనంద్ బక్షి సుప్రసిద్ద హిందీ సినీ కవి. గీత రచయితగా మారిన మాజీ సైనికుడు.
అవిభాజ్య పంజాబ్ నుంచి బొంబాయికి చేరి 1958లో తన మొదటి చిత్రం ‘భలా ఆద్మీ’ తో సినీరంగంలోకి అడుగుపెట్టేంత వరకు సాగిన ప్రస్థానం, ఆపై సినీ గీత రచయితగా బాలీవుడ్లో కుదురుకోవడం, పురోభివృద్ధిని – ‘నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ది లైఫ్ అండ్ లిరిక్స్ ఆఫ్ ఆనంద్ బక్షి’ పేరిట రచించిన పుస్తకంలో వారి కుమారుడు రాకేశ్ బక్షి వివరించారు.
ఆయన వ్యక్తిగత జీవితంలోని విశేషాలు, సినీరంగంలో ఎదుర్కున్న సవాళ్ళు, సాధించిన విజయాలు తదితర అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఈ పుస్తకం ఇప్పటికే హిందీ, మరాఠీ, తదితర భారతీయ భాషలలోకి అనువాదమైంది.
ఈ పుస్తకం తెలుగు అనువాదాన్ని.. మానవీయ విలువల స్ఫూర్తిదాయక కథని ‘సంచిక’ త్వరలో అందిస్తోంది.
వివరాలు త్వరలో..