[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
791.
సతత నిర్మాణ యవస్థకు లోనగుచున్నదీ విశ్వదేవళము;
అతని యాలయ నిర్మాణపు కూలీలమే మనము; అయ్యది
అతిథి గృహమో, స్వగృహమో, దేశమో, కులమో, మఠమో! నెంచక
మతి నిలువరించి పని చేయవలె – మంకుతిమ్మ!
792.
“ఆశల రేకెత్తించబోకు, పాశంబుల చిక్కుబడగ నీకు,
క్లేశయుత పరీక్షలకున్ నన్ను గురి చేయగబోకు,
వేసటించు పాపపు గుఱుతులన్ గుర్తు నకున్ రానీకు” ననుచు
ఈశుని వేడుము నిత్యము – మంకుతిమ్మ!
793.
నాటక రంగమీ జగము; నేను, నీవు ఈ జగము వేరని ‘మాయ’
నాటకామాడించు; బ్రహ్మవస్తువులే యన్నియుంయని దెల్సినంత
యాట ముగిసి మాయ కనుమరుగై, మోహవిభ్రాంతి వదల
నాటకము ముగిసిపోవు – మంకుతిమ్మ!
794.
నూరారు యనుభవంబులన్ వడసి మనసు ఎదుగుగాక,
నూరారు ఝురులవి యురికి జలనిధి జేరినట్టు – మనసు
వేర్పడవలె దేహసంబంధమున్ విడనాడి – పరబ్రహ్మ
స్వరూపంబైన చైతన్యముతో కూడి – మంకుతిమ్మ!
795.
మొలకెత్తుతున్న చిరు మొలకను; ఉదయంపు లేత
వెలుగును; ఎదుగుచున్న లేబ్రాయంపు శిశువును
చెలికాండ్ర చెంత చల్లని చెలిమిని, ఎల్లెడల కళ
కళలాడెడి చైతన్య మూర్తిని నేనని చరింపుము – మంకుతిమ్మ!
796.
మేలు రకపు విత్తనమునన్ మట్టిని నాట, మొలకెత్తునది; కాక
మేలుగ దాని వేయించిన జిహ్వకు రుచికరమగు
మొలకెత్తు కర్మఫలంబులు మరిమరి సంగయుక్తుండైన
మొలకెత్తవవి సంగత్యక్తుండైన తరి – మంకుతిమ్మ!
797.
అగ్ని స్పర్శ కీడైన రజ్జువది బూదియైనను రజ్జువుగ గన్నట్టు,
జ్ఞానవంతుని తత్త్వంబును నంతయె; లోకంబున్ నటులె గన్పట్టు; తత్త్వ
జ్ఞానికి లోకపు రీతులన్నియున్ బహ్మతత్త్వంబుగనె గన్పట్టు
జ్ఞాని లోక బంధనములకున్ కట్టువడడు – మంకుతిమ్మ!
798.
అమరులతో పనియేమి వానికి ఆశలేని యతనికి?
కామరాగ వివర్జితు వైరాగికి కష్టనష్టముల భయమేమి?
శమదమాది విషయంబుల పారంగతునకు దూరంబదేమి?
విమల చరితుడతడు స్వేచ్ఛాజీవి – మంకుతిమ్మ!
799.
తమదయిన హవిస్సాది పూజ నిల్పక లభ్యమగుగాక యని
అమరులు, భీరువులైన నరులకు తమ ఘోరరూపంబుల చూపెదరట!
ఏమరక పరమాత్మంబున్ దెలియ నుంకించువారికి, బెదరింపులేమి జేయు?
ఏమయినన్ నెదురించ సిద్ధుడగు – మంకుతిమ్మ!
800.
కడుపు నిండిన వాడికి కాయేమి? పండేమి?
కడు దార్శికునకు (తత్వజ్ఞానికి) పాప పుణ్యంబు లేవి?
ఏడు కొండల నెక్కిన వాడి చూపునకు మిట్టతగ్గులవేవి?
చెడని పూర్ణతలో వక్రత ఏది? – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084
