[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
571.
ముని వాల్మీకిన్ నీవలె గాక కళ్ళు నోరును భిన్నంబుగా నుండెనే
ఆ ముని జనుల హృదయంబులదూరి తన కవిత వినిపించె,
ఘన మహిమాన్విత శక్తియది జ్వలించుచుండు అందరిలోను
అనల మది నిద్రా వస్థనుండు – మంకుతిమ్మ!
572.
పురుష ప్రయత్నములన్నియు మట్టి పాలాయె నని
నిరాశ వలదు: చెడితి నని ఎన్నడున్ వాపోకు
శరధిన్ మత్స్యమొకటి పుట్టిన నేమి? గిట్టిన నేమి?
మరి మరి చింతించబోకు – మంకుతిమ్మ!
573.
పోరుసలుపు, ఒంటివాడైన నేమి? లేచి నిల ద్రొక్కి కొని
ధీర పథంబుననే నడువుము, ఏ సమయమున నైన;
దూరంబున నిలిచి గొణుగుచు జీవించ నేమి ఫలము?
పోరి, నీ సత్తువమును నిరూపించు – మంకుతిమ్మ!
574.
పోరు సల్పుము ధీరత తోడ మొండితనంబునం గాక,
వైరత్వము, పగయున్ వలదు: శ్రేష్టతా నియమంబుల పాటించు
వైరాగ్య ,కారుణ్యత మేలు కలయికయే ధీరత్వ మరయ,
పోరాడు నుదాత్త చరితుడవై – మంకుతిమ్మ!
575.
కక్షిదారు డొకండు తన కనుకూలంబుగ తీర్ప గునని,
సాక్షి బలంబులు తన కనుకూలించు నని యూహించు;
శిక్ష ఎటగునో తెఅయరాదు; భిక్షకుడ వోలె వర్తించి
పక్షి వోలె విహరంచుము – ముంకుతిమ్మ!
576.
తన బలా బలంబుల దెలిసి, తన గుణంబులెరిగి,
సన్నివేశపు సూక్ష్మ మెరిగి, ధృతి చెడక
తన కర్తవ్యపు పరిధి మేరకు తెలిసి వర్తించువాడే
పుణ్యశాలి – మంకుతిమ్మ!
577.
చిన్న నిప్పు రవ్వపై ఎండు మొద్దొక్కటి పడి దాని నార్పివేయు; ఆ
చిన్న నిప్పు రవ్వయే కాల్చి బూడిద సేయు నూరారు మొద్దుల
క్షీణ బలుడ వైన తరి ఘనకార్యంబు తలపెట్టబోకు, అ
క్షీణ బలండవైన తరి విజృభింపుము – మంకుతిమ్మ!
578.
కొండను ఎత్త ప్రయత్నించితివే మహత్వా కాంక్షివై!
దృఢమే ఆ గునపము! వంకర బోవదే నీ యాసాధనము,
వీడుము; నీ భుజము విరిగి పోగలదు
కడు జాగరూకుడవై మసలుము – మంకుతిమ్మ!
579.
నీ వెన్ను మోయగల భారంబును మోయ వెనుకాడకు,
ఆ విధి తనకైన దాని నెన్నుకొను; అడ్డు చెప్పబోకు;
నీ వెన్ను భంగపడిన యయ్యది నీకది శిక్షణ,
అవశ్య మాన్య ఒప్పందమిది మంకుతిమ్మ.
580.
దొర వేషంబు గట్టి దొడ్డగా తిప్పెదవు మీసంబును,
తిరుపమెత్తు బాపడి వేషంబుగట్టి తిప్పగలవే? వారి
వారి తానంబుల కున్నవి వారి స్థానమాన ధర్మములు:
అరయ సూక్ష్మమింతే – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084