అనకాపల్లిలోని ‘తెలుగు భాషా పరిరక్షణ’ సమితి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువతీ, యువకులకు కథల పోటీ నిర్వహించదలచింది.
వివరాలు:
- వయోపరిమితి: 13 – 25 సంవత్సరాలు
- అంశం: ఏదయినా
- పదాల పరిమితి: 600 నుంచి 1000 పదాల లోపు.
బహుమతుల వివరాలు:
- ప్రథమ: ₹ 2000/-
- ద్వితీయ: ₹ 1500/-
- తృతీయ: ₹ 1000/-
- ప్రోత్సాహక: ₹ 500 (ఐదుగురికి)
నిబంధనలు:
ఒక్కొక్కరు ఒక్కొక్క కథనే పంపాలి. కథ పైన రచయిత పేరు ఉండకూడదు. హామీ పత్రంలో వివరాలు పొందుపరచవచ్చు. తాము పంపే కథ తమ స్వంతమేనని, దేనికీ అనువాదం గానీ, అనుసరణగానీ కాదని, ఇదివరకు ప్రచురింపబడలేదని, అంతర్జాల మాధ్యమాలలో పెట్టలేదని, ఏ పత్రిక పరిశీలనలో లేదని హామీ ఇవ్వాలి. వయో నిర్ధారణ పత్రం కూడా జతచేయాలి.
ఆఖరు తేదీ: 20 అక్టోబర్ 2025.
పంపవలసిన మెయిల్ ఐడి: krmohan230@gmail.com
వాట్సప్ నంబర్: 9849345060
బహుమతి పొందినవారు స్వయంగా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. సర్వహక్కులు నిర్వాహకులవే.
బహుమతి ప్రదానోత్సవం, ఈ నెల 24 నవంబర్ 2 మధ్య జరిగే అనకాపల్లి పుస్తక మహోత్సవంలో జరుగును.
ఇతర వివరాలకు 9704811444 9182873598, 9493641584 లలో సంప్రదించవచ్చు.
ముఖ్య గమనిక:
ఈ ఏడాది అనకాపల్లిలో డిసెంబరు నెలలో యువ కథకులకు తర్ఫీదు నిచ్చే, ‘సాహితీ కార్యశాల’ను నిర్వహించే యోచన ఉన్నది.
సమన్వయకర్త: కె. రామ్మోహన్ రావు
తెలుగు భాషా పరిరక్షణ సమితి, అనకాపల్లి
సమన్వయకర్త