[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘తెల్ల కాగితము’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సాగుబడి నేలలో
చల్లిన విత్తనాలు
మురిపెంగా మొలకెత్తగానే
మట్టిలోని మహిమ చూసి
రైతు పొందే అనుభూతికి
పుడమితల్లి పులకించిపోయినట్లే
మనోఫలకం మీద
చెక్కిన అక్షరాలు
వైవిధ్యంగా మారగానే
అక్షర సౌందర్యాన్ని చూసి
కవి అనుభవించే ఆనందానికి
తెల్ల కాగితం తరించి పోతుంది
రచన చేయడం ఒక కళ
చేసిన రచన ఓ రంగుల కల