[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
261
నోరు ఆహారాన్ని తినే అవయవం
కోరుకున్న రుచులన్నీ భుజిస్తుంది
నేరుగా పొట్టలోకి పంపిస్తుంది
అరిగిన ఆహారం రక్తంగా మారు ప్రేవులలో
262
వనంలో పెద్ద రంకె వేసె బసవడు
వనంలోని జంతువులన్నీ భీతిల్లి
కనబడకుండా పారిపోయె
వనమంతా తిరిగి నిష్క్రమించె బసవడు
263
రక రకాల వస్తు ప్రదర్శన శాల
చక చకా చేరిరి అమ్మాయిలు అబ్బాయిలు
వంకలు పెట్టిరి వస్తువులకు
ఒక్కటీ కొనకుండా వెళ్లిపోయె
264
నిలువు దోపిడీ ఇస్తారు దేవుళ్ళకు
కొలువు తీరిన దేవుడు వరాలిస్తాడని
మేలు చేస్తాడనే నమ్మకంతోనే
పలు మార్లు మొక్కి వేడుకుంటారు
265
వూసరవెల్లి రంగులు మార్చినట్లే
మోసగాళ్లు తమ మాటలతో మోసగిస్తారు
కాస్తంత గూడా ఆలోచించుకోనివ్వకుండా
తస్కరిస్తారు సొమ్మునంతా
266
లోకములో వున్న ప్రజ
వక్ర మార్గాలకు ఎందుకు పాల్పడతారో?
సక్రమంగా అంత సంపాదించ లేకనే
అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆశ
267
కోరుకున్నవి పొందలేక, అప్పులు పాలైనా
నిరాశ నిస్పృహలతో జీవితం సాగించలేక
ఉరికి సిద్ధమౌతారు
ఉరి ఆహ్వానించి అంతం చేస్తుంది
268
కాకుల ప్రవర్తన విచిత్రమైనది
ఒకటి చనిపోతే దాని చుట్టూ చేరి అరుస్తవి
చక చకా నీటిలో స్నానము చేస్తవి
ఐకమత్యంగా వుంటై
269
మనసును అదుపులో ఉంచాలని
కనులు మూసుకొని ధ్యానం
ధ్యానంలో మనసు ఆధీనంలోనే వున్నదా లేదనే ఆలోచన
కనుక అదుపెక్కడ?
270
మనసు కోతి లాంటిది
తనను అదుపు చేయటం సాధ్యమా
తనను ఎవరైనా చూశారా
తనను చూసేది వైద్యుడు మాత్రమే, అదీనూ మాంసం ముద్దనే
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.