[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘స్వేచ్ఛా విహారివి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఓ నా మనసా
పరుగు తీయకే
పరువు తీయకే
చేదైనా తీపే
వగపైనా వలపే
బాధైనా హాయే
కల అయినా నిజమే
వూహనైన ఆహా అంటావు
లేవు కదా రేపూ, మాపు
అసలుందా ముందు చూపు
స్వేచ్ఛా విహారివి
సకల లోక సంచారివి
మాయల మారివి
మారని దారివి
మనిషిలోనే వుంటూ
అతనికే ద్రోహం
చేయడం నీకే సాధ్యం
అనాదిగా ఇదేగా
నీ నిత్య కృత్యం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.