ఆస్తులు అంతస్తులు చూసి చేసేది కాదు..
లాభ నష్టాలు బేరీజు వేసుకుని చేసేది కాదు.. స్నేహమంటే!
మమతానురాగాలకు నిలయం..
గౌరవవాత్సల్యాలకు ప్రతిరూపం.. స్నేహం!
ఈ సృష్టిని నడిపించే చైతన్యం.. స్నేహం!
ధరణిని ఏలే రారాజుకైనా వుండవలసిన తొలిలక్షణం.. స్నేహస్వభావం!
అందుకే నేస్తం..
అందరికీ స్నేహహస్తం అందించు..
స్నేహ మధురిమలు నలుదిశలా విస్తరించేలా..
జగతి అంతా స్నేహభావనలతో వర్థిల్లేలా..
స్నేహ సౌరభాల పరిమళాలు విరియాలని తపించి ..
ఆత్మీయ నేస్తాల పలకరింపులతో హాయిగా తరించు!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.