ది 6-4-2025 నాడు నల్గొండ జిల్లా చెరువుగట్టు గ్రామంలోని శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. ఉదయం 10 గంటలకు సోమేశ్వర శివజ్ఞాన పీఠం అధ్యక్షులు పి అరుణ మరియు రామలింగేశ్వర శర్మ దంపతులు కవులకు పూర్ణకుంభంతో ద్వారం వద్ద నుండి ఎదురేగి స్వాగతం చెప్పారు. మంగళ వాయిద్యాలతో చక్కని స్వాగతం ఘనమైన స్వాగతం జరిగింది.
సుమారు 70 మంది పాల్గొన్న ఈ కవి సమ్మేళనంలో అనేక దూర ప్రాంతాల నుండి కవులు, రచయితలు వచ్చారు. ఒక పది నిమిషాల పాటు ఆశ్రమమంతా తిరిగి ఎక్కడా లేని మొక్కలు , చెట్లు, శివలింగం విశిష్టతలన్నీ కూడా చూసి ఆ తర్వాత ఆ ట్రస్ట్ భవనం మొదటి అంతస్తులో ఏర్పాటయిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.
హాల్లో చుట్టూ స్తంభాలకు మహామహులు గొప్పవారైన కవుల ఫోటోలు అలంకరించబడినవి. దాశరధి కృష్ణమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దాశరధి రంగాచార్య, సి. నారాయణ రెడ్డి, అడవి బాపిరాజు, వారణాసి యశోదా దేవి, జాషువా, బిరుదురాజు రామరాజు, చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, వానమామలై వరదాచార్యులు, వట్టికోట అల్వార్ స్వామి, కాళోజి నారాయణరావు – మొత్తం 25 మంది గొప్ప గొప్ప కవుల ఫోటోలతో సహా వేదిక అలంకరింపబడినది.
కొబ్బరిమట్టలతో మామిడి ఆకులతో అరటి బోదెలతో చక్కని వేదిక చేయబడినది. సభాధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య కవి రచయిత ప్రొఫెసర్ ఇన్ తెలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట..
ముఖ్య అతిథులు: ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారు కవి రచయిత, గజల్స్ రచయిత. కీర్తి పురస్కార గ్రహీత తెలుగు విశ్వవిద్యాలయం.
విశిష్ట అతిథులుగా ప్రముఖ సినిమా పాటలు రచయిత బండారు దానయ్య గారు; ఆత్మీయ అతిథులుగా పున్న అంజయ్య గారు, సాహితీ మేఖల ప్రధాన కార్యదర్శి. పెరుమాళ్ళు ఆనంద్ గారు, సృజన సాహితీ అధ్యక్షులు సాగర్ల సత్తయ్య గారుమ్ సృజన సాహితి ప్రధాన కార్యదర్శి భాను శ్రీ కొత్వాల్ గారు కవి, రచయిత్రి, ఉపాధ్యాయురాలు; డాక్టర్ ఝాన్సీ ముడుంబయ్ కవి రచయిత్రి హైదరాబాద్ వేదికపై ఆసీనులైనారు.
వేదిక ముందు ఆసీనులైన వారిలో మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి బంధువు మరియు కామేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఇంకా నల్గొండ వాస్తవ్యులు కల్లోజు కనకాచారి గారు సీనియర్ కవి ఉన్నారు. వీరు కపిలివాయి లింగమూర్తిని ఆహ్వానించి సన్మానం చేయడమే కాక ఎన్నో కవి సమ్మేళనాలు జరిపించిన ఘనాపాటి.
ముఖ్యఅతిథి ఎన్.వి. రఘువీర్ ప్రతాప్ గారు సాహిత్యంలో 10 ప్రక్రియలలో వ్రాయగలిగిన దిట్ట. అంతేకాదు వీరి కవిత్వం, గజల్స్, శాసనసభలో కూడా వాడిన సందర్భం లేకపోలేదు. కాకినాడ వారిచే బంగారు కడియం తొడిగించుకున్నవారు. అంతేకాదు వీరికి డాక్టర్ సి. నారాయణ రెడ్డి, కపిలవాయి లింగమూర్తి ఎంతో సన్నిహితులు.
ఆధునిక టెక్నాలజీ యుగంలో కుటుంబం వెలవెలబోతున్న సమయంలో ఉమ్మడి కుటుంబాన్ని గురించి కవిత రాసిన సూర్యాపేట వాస్తవ్యులు వీరాచారి గారు. గత 30 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమంలో పాటలు రాయుచున్న కవి దానయ్య గారు పద్య కవి పరంధాములు గారు పద్యాలను ఆలపించారు. అద్దంకి లక్ష్మయ్య గారు నటులు కూడా. నిర్మల్ నుండి వచ్చిన బి వెంకట్ చక్కని కవిత్వం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కవి యాత్ర అనే ప్రక్రియ మొదలుపెట్టిన సంస్థ వీరిదే.
అలాగే చండూరు సాహితి మేఖల వారసులు పున్న అంజయ్య గారు అతిథిగా పాల్గొన్నారు. చక్కని కవితలు రాసే మహిళా కవయిత్రి భానుశ్రీ కొత్వాల్ గారు, సృజన సంస్థ అధ్యక్షుడు సీనియర్ కవి పెరుమాళ్ళ ఆనంద్ గారు, ప్రధాన కార్యదర్శి సాగర్ల సత్తయ్య గారు తమ కవితలు వినిపించారు.
సుదూర ప్రాంతమైన గుంటూరు నుండి వచ్చిన శేషమాంబ గారు ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ 2025 మరియు నారీరత్న అవార్డు గ్రహీత. వీరు పాల్గొని కవిత గానం చేశారు అలాగే వీరితో పాటు వచ్చిన అరుణ కుమారి గారు చక్కని కవితలు వినిపించారు.
ప్రకృతి పంచభూతాల మీద కవిత రాసిన సిలివేరి యాదగిరి, ఇంకా దేవదానం రాధా, రప బిక్షపతి, తుమ్మ రాజా, గడ్డం కృష్ణారెడ్డి గార్ల కవితలు సభికులను హర్షద్వానాలు చేయించాయి. మోత్కూరు బ్రహ్మచారి, కడియం సోమన్న సీనియర్ కవి ఇంకా ఈడుకోజు బ్రహ్మచారి, రాపోలు జయకర్ సీనియర్ కవి, బొల్లా ప్రవీణ్, నర్రా ప్రవీణ్, మహాత్మ గాంధీ యూనివర్సిటీ నుండి గంగాధర నరసింహ, మద్దిరాల సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కోదాడ వాస్తవ్యుడు పూసపాటి వేదాద్రి పాల్గొనగా, గొర్రెపాటి శ్రీను, మద్దోజు వెంకట సుధీర్, సిహెచ్ పుష్పగిరి మొదలైన వారు మాత్రమే కాక సీనియర్ కవులు జేవి కుమార్, గజవెల్లి దశరథ రామయ్య పాల్గొన్నారు. వేసవికాలం అయినప్పటికీ ఆశ్రమం యొక్క వాతావరణం చల్లగా ఉండటం వల్ల పైగా ఐదంతస్తుల బిల్డింగ్లో మొదటి అంతస్తులో కవి సమ్మేళనం బ్రహ్మాండంగా జరిగింది. చుట్టూ విశాలమైన ప్రాంగణం. చెరువుగట్టు పరశురాముడు ప్రారంభించిన ప్రాంతం దీని విశిష్టత.
ఈ కవి సమ్మేళనానికి సిలివేరు సాహితీ కళా పీఠం సిలివేరు లింగమూర్తి, శ్రీవాణి సాహిత్య పరిషత్ పెందోట సోము సహకరించడంలో ఎంతో కృషి చేశారు.
వందన సమర్పణ శ్రీ రామలింగేశ్వర శర్మ గారు చేయగా ఈ సమావేశానికి సహకరించిన వారు రామకృష్ణ ట్రస్ట్ సభ్యులు, మాజీ నల్గొండ జిల్లా గ్రంధాలయ చైర్మన్ రికట్టే మల్లికార్జున్ రెడ్డి గారు. భోజనం నర్సిరెడ్డి గారు సీనియర్ కవి. చింతోజు మల్లికార్జునచారి, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి కవితలతో ఈ కార్యక్రమం ముగిసింది.