10.
మనసున్నంత వరకే
మాటల సందడి
ఊపిరి ఆగితే
అన్ని మాయమే
11.
ఆడవారి మనసు
అంతులేని నిగూఢం
నిగ్గు తేల్చే
ఘనుడేడి?
12.
మంగళ ప్రదంగా
పని ఆరంభించాలి
జయప్రదంగా
పని సాధించాలి
13.
అంతులేని
రహస్యాలెనెన్నో శూన్యంలో
శోధించుట
ఎవరికి సాధ్యం?
14.
జీవరాశుల
కాల వ్యవధి
దేనికెంత అని
ఎవరు చెప్పగలరు?
15.
ఉచ్ఛ్వాస
నిశ్వాసలే ప్రాణం
శ్వాస ఆగితే
అంతే సంగతులు
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.