Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-7

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. తన తల్లిని వధించడానికి నిరాకరించిన ‘జమదగ్ని’ మహాముని పెద్ద కొడుకు ఎవరు?
  2. హిమవంతుడి కూతురు, పార్వతీ దేవి సోదరి అయిన దేవకన్య ఎవరు?
  3. మందాకిని నదికి, అలకనంద నదికి మధ్యలో ఉండే క్షేత్రం ఏది?
  4. దేవీ భాగవతాన్ని అనుసరించి రాక్షసుడైన కరంభుడి సోదరుడు, శివుని కోసం తపస్సు చేసి దేవతల్ని గెలవగలిగే కొడుకు నిమ్మని శివునిచే వరమొంది, ఒక మహిషంతో రమించి మహిషాసురుడికి జన్మనిస్తాడు. కరంభుడి సోదరుడు, మహిషాసురుడి తండ్రి ఎవరు?
  5. భాగవతం ప్రకారం ఊర్వశీ పురూరవుల కుమారుడైన చంద్రవంశపు రాజు – ఆయుస్సు, శృతాయుస్సు, శతాయుస్సు, విజయుడు, జయుడుల సోదరుడు ఎవరు?
  6. భారతాన్ననుసరించి, ఏ భారతదేశపు రాజు, అహింసావాది, మద్యం, మత్తు కలిగించే ఔషధాలు, తేనె, మాంసం, మెదలగు వాటిని నిషేధించాలని అభిప్రాయపడ్డాడు?
  7. సైంధవుడి తలను నేలకూల్చేవాడి శిరస్సు నూరు ముక్కలగునట్లు శపించిన తండ్రి, శ్రీకృష్ణుని బోధచే అర్జునుడు సైంధవుని తలను అతని తండ్రి ఒడిలో పడేట్టు చేయగా, ఉలిక్కిపడ్డ అతని తండ్రి కుమారుని తలను నేలపై పడవేసి, తన తల నూరు ప్రక్కలై మరణించాడు. అతని పేరేమిటి?
  8. భారతాన్ని అనుసరించి పరశురాముడు క్షత్రియుల్ని సంహరించిన తర్వాత వారి రక్తాన్ని అయిదు మడుగులు చేసి పితృతర్పణం చేసిన స్థలాన్నిమంటారు?
  9. విష్ణుపురాణం ప్రకారం, ఋశంకుని మనుమడు, చిత్రరథుని కొడుకు – అనేక యాగాలు చేసి లక్ష మంది భార్యలు, వారికి ఒక్కొక్కరికి చాలామంది కొడుకులున్న రాజు ఎవరు?
  10. మత్స్యపురాణాన్ని అనుసరించి, పార్వతీ పరమేశ్వరులు రహస్యంగా విహరించే అరణ్యంలో, ఒకసారి వారిద్దరూ క్రీడిస్తున్నప్పుడు. కొందరు పురుషులు అక్కడికి రాగా, పార్వతీ దేవి యీ వనం చుట్టు పక్కలకు వచ్చేవారు స్త్రీలు అవుతారని శపించింది. ఆ అడవి పేరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 మే 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 మే 18 తేదీన వెలువడతాయి.

జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 5 జవాబులు:

1.తాలధ్వజుడు 2. కైకసి 3. దేవిక 4. ద్రవిళుడు 5. పనసుడు 6. కుసుమ శ్రేష్ఠి 7. భాస్కరాచార్యుడు 8. మణి వట్టా ప్పారం 9. మిత్రవింద 10. మౌద్గల్యుడు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 5 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version