[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘పంక్తుల నడుమ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దారుల తొక్కిస ఆట
భావోద్వేగాల గుండె పాటైంది
కాలం ఉత్తేజిత
పారే నది అనామిక
ముక్తి మహాకుంభమేళా
ద్వాదశ కుంభమేళాల వరుస సుదీర్ఘకాలం భక్తి
ఉత్తేజ సంతోషమే
ఊపిరాడని పీడనం
ఉత్సవహేల తీపి భారతీయత
తరతరాల నజరానా
జనవిస్ఫోటన పదఘట్టనలే
సాగి సాచే చేతులన్నీ
విగత మృదంగ భాషే
సంస్కృతి సంప్రదాయాల హోరులో
తలపెట్టినదే త్రివేణీ సంగమం
మనుషుల నడుమ
ఎడంలేని దారులన్నీ ఉద్వేగాలే
పంక్తుల నడుమ
అల్లిన కవుల ఉద్రేకాలే
అక్షరయాత్రలో హృదయోల్లాసం వ్యాఖ్య
పదపంక్తుల నడుమ నడకే లీల
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.