ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.
~
అందరి జీవితాలు ఒకలా ఉండవు. కొందరిలి పూలబాటలు, మంకొందరిని ముళ్ళబాటలు. ఈ రెంటి లక్షణాలు కలిగిన బాటలు కూడా ఉంటవి. అన్ని బాటలు తెలుసుకోవాల్సినవే. బాటల అనుభావాల నుండి పాఠాలు నేర్చుకోవాల్సిందే. తెలుసుకోవడానికి కొంత సహనం, కొంత సహానుభూతి ఉండాలి. అలాంటప్పుడు నేర్చుకోగలుగుతాము. ఎంతో కొంత నేర్చుకోదగిన విషయము ప్రతి రచనలో ఉంటుంది.
జీవితంలో సగభాగానికి ఎక్కువ కాలం బడిలో గడిపిన వ్యక్తి పాఠశాల ప్రభావాల గురించి చెప్పిన మాటల్లో సత్యం ఉండి తీరుతుంది. విద్యార్థిగా చదువుకొని, ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పిన రచయిత డా. బి.వి.ఎన్. స్వామి, ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయిల వరకు పాఠ్య పుస్తక రచయితగా అనుభవంతో పాటు బోధకుడిగా నైపుణ్యం కలిగిన వీరి కలం నుండి జాలువారిన నవల ‘పల్లేరు కాయలు’.
సుమారు అర్ధ శతాబ్దపు పాఠశాల పరిణామాలు, సామాజిక మార్పులు, వివిధ రంగాలపై ప్రపంచీకరణ వేసిన ప్రభావాలు నవలంతా పరుచుకొని ఉన్నాయి. తన జీవితాన్నే ప్రమాణంగా తీసుకొని, జరిగిన సామాజిక మార్పుల్ని విశదీకరించారు డా. స్వామి.
రచయిత తనను తాను లిట్మస్ టెస్ట్కి గురి చేసుకొని రచించిన ‘పల్లేరు కాయలు’ నవలను వచ్చే వారం నుండి ధారావాహికంగా ప్రచురించబోతున్నాము.
~
చదవండి, చదివించండి.
‘పల్లేరు కాయలు’ నవల
వచ్చే వారం నుంచే