ఏమీ తెలియని లోకంలోకి
ఎవరూ కాకుండా వచ్చి
అందరూ తన వారనుకుని
ఎన్నో బంధాలు పెంచుకుని
చెట్టాపట్టాలేసుకుని
చుట్టాలను పక్కాలను చేసుకుని
అందరూ తనవారనుకుని
భ్రమిస్తూ పరిభ్రమిస్తూ
అందులోనే మునిగి తేలుతూ
సాగుతున్న పయనంలో
అసలు నిజం తెలిసే వేళ
ఆవలి ఒడ్డుకు చేరే వేళ
అంతా అయోమయం
అన్నీ అగమ్యగోచరం
అన్నీ తెలుసనుకున్న
అహంభావం అంతా ఆవిరైన వేళ
ఏమీ తెలియకుండానే
పడమర దిక్కుకు జారిపోతామంతే
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.