[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘ఓ మనిషీ.. నీ పయనమెటు’ అనే కవితని అందిస్తున్నాము.]
తోటి మనిషి తల్లడిల్లుతున్నాడు
కూటికి గుడ్డకు గూడుకు
నీ మానానా నువ్వు
బతికేస్తున్నావ్
వాడి మానాన వాన్ని వదిలి
చీము రక్తం వున్న మనిషి
చేసే పనా ఇది
సాటి మనిషి బాగోగులు
పట్టవా నీకు
దానధర్మాలు చేసే రోజులు కావు
ఆ రోజులొక గతించిన జ్ఞాపకం
I am busy.. you know
Please leave me
అది చేస్తాం ఇది చేస్తాం
శుష్క వాగ్దానాలు చేసి
అందలమెక్కిన నయా నవాబుల్లారా
వినబడుట లేదా..
అన్నార్తుల ఆకలి కేకలు
టైమ్ లేదు.
please excuse me
I have better things to do
అలా తప్పుకుంటా వేమిటీ
కుంటి సాకులు చెప్పి
పని కావాలోయ్
బతుకు తెరువు కావాలోయ్
అని అడిగే ధైర్యం లేదు బాధితులకు
అడిగితే కాని అమ్మైనా పెట్టదు
సామెత తెలియదు కాబోలు ఈ
మూగ మనసులకు
తినే వాన్ని చూస్తూ
తాగే వాన్ని చూస్తూ
కట్టే వాన్ని చూస్తూ
కాలం గడిపేసే మనిషీ
నీ పయనమెటు..
ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.