[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నిరాశ వద్దు..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆశకి నిరాశకి మధ్య లోలకమై ఊగుతుంటుది జీవితం!
జీవితంలో గెలుపు ఓటములు సహజం!
జీవితం అంటే గెలుపుకై సమరం!
ఓటమి ఎదురై ఇబ్బంది పెట్టినప్పుడు
ఓర్చుకుని ఓర్పుగా విజయం కోసం శ్రమించాలి!
‘కష్టే ఫలి!’ అన్నట్లుగా..
శ్రమిస్తే తప్పకుండా అపజయాలు పటాపంచలై
గెలుపు ప్రియమైన పలకరింపులా దగ్గరై
నిన్ను సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుంది!
ఓటముల అగాధాలని తట్టుకుని
ధీమాగా దాటితే గాని గెలుపు శిఖరాలని చేరుకోలేవు నేస్తం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.