[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ నేను లేననీ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అదేంటో
నీతో పరిచయమయ్యాక
నా తీరే వేరుగా వుంది
కళ్ళు మాట్లాడుతున్నాయి
హృదయం చూస్తోంది
పెదవులు మౌనమయ్యాయి
చెవులకు నీ పేరే
తప్ప ఏదీ వినిపించడంలా
ఇంకా చెప్పాలంటే
ఒళ్ళంతా కళ్ళయ్యాయి
మనసంతా వేణువైంది
ఇలా ఏదేదో జరిగిపోతోంది
మరేది తెలియకపోయినా
ఒకటి మాత్రం తెలుస్తోంది
నీవుంటేనే నేనున్నానని
నీవయ్యాకనే నేను లేనని
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.