[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘నీవు మారాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ మిత్రమా!
మరవాలి నీవు
‘సర్వం నీకు తెలుసు’
అనే ధోరణిని
అదే గనుక
నిత్యం కొనసాగిస్తే
మరవాలి
నీ అస్తిత్వాన్ని
ప్రతి క్షణం
ప్రయత్నించు
లోతుగా
ఆలోచించు
అవగాహనతో
విశ్లేషించు
నలుగురితో
చర్చించు
ఆపై నీ
నిర్ణయంతో
మెప్పించు
జనులందరినీ
అవగాహన లేమితో
స్వీయ పోకడతో
తీసుకునే నీ నిర్ణయం
ఎల్లవేళలా చూపును
జనులందరిపై దాని
ప్రభావం
అందుకే ఓ మిత్రమా
మరవాలి నీవు
నీకు సర్వం తెలుసు
అనే మూస దోరణిని
వీడాలి స్వీయ పోకడను
మెచ్చాలి అనునిత్యం
అందరూ నీ నిర్ణయాన్ని
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్