[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘నీవో మధువిధ్వంసం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీ చూపులు
మధుర విధ్వంసం
చేస్తున్నాయి.. నా ఎదన
నీ వదనాలు
మధు తుఫాను
లేపుతున్నాయి.. నా గుండెన
నీ నయగారాలు
నయాగరలా
దూకుతున్నాయి.. నా భావాన
నీ వలపులు
తేనె చిలకలై
వ్రాలుతున్నాయి.. నా అధరాన
నీ సొంపులు
స్వరాలు
మీటుతున్నాయి.. నా నరనరాన
ఈ సంపద చాలదా
నూరేళ్ళు.. నిత్య నూతనంగా
బ్రతకటానికి
నిండైన ప్రేమ-ప్రణయం పంచడానికి
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.