[‘మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ – 2025’ కోసం కథలకు ఆహ్వానం – ప్రకటన అందిస్తున్నారు శ్రీ సింహప్రసాద్.]
నా సాహిత్య స్వర్ణోత్సవ సందర్భంగా నాకు స్ఫూర్తి, ప్రేరణ అయిన మహాకవి శ్రీశ్రీ కి చిరు నివాళిగా 2023లో నిర్వహించిన పోటీకి వచ్చిన అపూర్వ స్పందన చూసి ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాము.
- మూడు కథలకు మూడు బహుమతులు
- ఒక్కో దానికీ 2000/-
- అంశాలు: తలుపు గొళ్ళెం, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం
నియమ నిబంధనలు:
- ఒక్కో అంశానికీ ఒక్కో బహుమతి అనే నియమం లేదు. బాగుంటే ఒక్క అంశం మీదే రాసినా ముగ్గురికి బహుమతి ఇవ్వవచ్చు.
- నవ, యువ, నడి వయస్సు రచయితలను ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశం గనుక 50 ఏళ్లు దాటని వారికే ఈ పోటీ పరిమితం.
- ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. అనువాదాలు, అనుసరణలు పంపవద్దు.
- బహుమతి పొందిన కథలు ‘మా కథలు -2024‘ సంకలనంలో ప్రచురించబడతాయి. ఇందుకు ఆమోదం తెలిపిన సంపాదకులు, ‘సహస్ర కథానిధి’ వాణిశ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు.
- ఒక ప్రఖ్యాత సాహితీవేత్త న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు
- కథ చేతిరాతలో 3- 8 పేజీలు, డిటిపి చేయిస్తే 3 – 5 పేజీల మధ్య ఉంటే మంచిది.
- ప్రముఖుల సమక్షంలో శాలువా సత్కారం, జ్ఞాపిక ప్రదానం ఉంటాయి .
- కథలు పంపుటకు ఆఖరు తేది 20-8-2025. ఫలితాల ప్రకటన 20-9-2025.
- అక్టోబర్ 14, 2024న రవీంద్ర భారతి, హైదరాబాద్లో బహుమతి ప్రదానం ఉంటుంది.
- కథలను ఈ క్రింది చిరునామాకు పంపించవలెను: Siva Rama Prasad (Vanisri), Swagruha Apartments, C- Block, F-2, Opp. KPHB, Kukatpally, Hyderabad -500072. Cell: 9390085292, 8309860837. srisri.kathalapotee@gmail.com అనే మెయిల్ ఐడికి కూడా పంపవచ్చు.
సింహప్రసాద్
కన్వీనర్
~
సింహప్రసాద్ సాహిత్య సమితి 401, మయూరి ఎస్టేట్స్, ఎం.ఐ.జి -2-650 కే.పి.హెచ్. బి. కాలనీ, హైదరాబాద్-500072, సెల్: 98490 61668