రామదాసు సాహితీ కళాసేవా సంస్థ, హైదరాబాదు వారి ద్వితీయ వార్షికోత్సవము సందర్భముగా 13.4.25 న చిక్కడపల్లి త్యాగరాజగాన సభలో 69 మంది కవులకు బిరుదులు ప్రదానం చేయగా, విశాఖపట్టణం, గోపాలపట్నం కు చెందిన ప్రముఖ కవి గౌరీపతి శాస్త్రికి ‘సాహిత్య భాస్కర’ బిరుదు ప్రదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి తేజావత్ రామదాసు గారు, అడిషనల్ డి.సి.పి.(హైదరాబాదు) ముఖ్య అతిధిగా విచ్చేయగా, శ్రీ రామకృష్ణ చంద్రమౌళి, డా. వి.డి.రాజగోపాల్, డా.రాధాసుసుమ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. రామదూత కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.