[బాలబాలికల కోసం ‘కొండలతో ఊరి పేర్లు – సరదా క్విజ్’ – అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
- రామ భక్తుడు కొండ ఎక్కింది ఎక్కడ?
- ఏం చెప్పినా ఆలకించే కొండ ఎక్కడ ఉంది?
- ఈ కొండకు గట్టు కట్టారు ఎక్కడో చెప్పండి?
- ఈ మహాకొండ రాయల వారి రాజధాని కూడా!
- ఈ కొండలో పల్లెటూరుంది. బొమ్మలకు ప్రసిద్ధి కూడా!
- ఇక్కడ ఏడు కొండలుంటాయి. శ్రీహరి నివాసమది. ఎక్కడ?
- భువనానికి కొండ తోడయితే వచ్చే ఊరు పేరు?
- శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో పైకెత్తిన కొండ పేరు?
- హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన కోట పేరు?
- ప్రభలతో తిరణాలకు ప్రఖ్యాతి చెందిన కొండ ఎక్కడ?
- రెడ్డి రాజులు కట్టించిన కోట?
- మన రక్తం తాగి జబ్బుల్నిచ్చే జీవితో వచ్చే కొండ?
- ఈ కొండకు గుత్తి ఉంది. అదెక్కడ?
- ఏం మరిచినా ‘యాద్’ చేసే కొండ ఎక్కడ ఉంది?
జవాబులు:
1.హనుమకొండ, 2. వినుకొండ, 3. కొండగట్టు, 4. పెనుగొండ, 5. కొండపల్లి, 6. తిరుపతి, 7. భువనగిరి, 8. గోవర్ధనగిరి, 9. గోల్కొండ, 10.కోటప్పకొండ, 11. కొండవీడు, 12. దోమకొండ, 13. గుత్తికొండ, 14. యాదగిరి.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.