[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘కవిత్వం ఎందుకు?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మనసులోని భావాలను
మనం వినేటట్లు వ్యక్తపరచుటకు.
సత్యాన్ని – అసత్యాన్ని
స్పష్టంగా వెలికి తీయుటకు.
సమస్యలను సమాజానికి
తేటతెల్లంగా తెలియజేయుటకు.
జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని
అందరితో పంచుకునేందుకు.
భిన్నాభిప్రాయాల మధ్య
అవగాహన వంతెనను నిర్మించేందుకు
వ్యక్తిగత, సామాజిక మార్పుల
పరిణామాలను విశ్లేషించేందుకు.
జోడు గుర్రాల జీవిత సమరాన్ని
అజేయంగా గెలిచేందుకు!
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్