[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కవితావేశం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఏమిటో కలం
కదులుతోంది
కదం తొక్కుతోంది
కవితలల్లుతోంది
నిన్నా మొన్నా లేని
వెర్రి ఆవేశం
నేడు ఎందుకో
కవితగా మమతగా
నన్ను దాటుకుని
నాలో నుంచి
ఎగిసిపడుతోంది
ఒడిసిపట్టాలంటే
కుదరదంటోంది
ఇంతకీ ఈ కవితావేశం
ఈ మమతావేశం
ఎందుకో ఏమిటో
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.