శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు సాహితీ సమితి వారి ఆధ్వర్యంలో ఈ నెల 30 న సోమవారం మధ్యాహ్నం తెలుగు అధ్యయన శాఖలో ‘కథా సాహిత్యం – గ్రామీణ జీవనం’ అనే అంశంపై రచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఆచార్య కొలకలూరి మధు జ్యోతి అధ్యక్షత వహిస్తుండగా సాహితీ సమితి సలహాదారు డాక్టర్ వై.సుభాషిణి, మరియు తెలుగు శాఖ విద్యార్థినులు పాల్గొననున్నారు.