Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘కథాఋషి’ మునిపల్లె రాజు శతజయంతి సాహిత్య పురస్కార సభ – ఆహ్వానం

‘కథాఋషి’ మునిపల్లె రాజు శతజయంతి సందర్భంగా 2023 సాహిత్యపురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, సప్తపది లఘుకవితా ప్రక్రియ సృజనకర్త శ్రీ సుధామ గారికి, 2024 సాహిత్య పురస్కారాన్ని సుప్రసిద్ధ కథా, నవలా, సినీ రచయిత శ్రీ చంద్రశేఖర ఆజాద్ గారికి ప్రదానం చేయడానికి మునిపల్లె రాజుగారి కుటుంబసభ్యులు నిర్ణయించారు.

ఈ పురస్కార ప్రదాన సభ మార్చి 17వ తేదీ సోమవారం సాయంకాలం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఎం.వి.ఆర్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

సాహితీ ప్రియులందరికీ ఆహ్వానం.

డా. ఉష మునిపల్లె
మునిపల్లె రాజు కుటుంబ పక్షాన

మట్టిగుంట వెంకటరమణ
అధ్యక్షులు, MVR ఫౌండేషన్

Exit mobile version