కలుసుకున్న కన్నులు పంచుకున్న ఊసులు..
ఎప్పటికీ నన్ను వీడని జ్ఞాపకాలే!
ఒకే లయగా మ్రోగుతున్న గుండెల సవ్వడులు..
నువ్వెక్కడ వున్నా నా హృదిలో మెదిలే సుమధురాలే!
సాగర తీరాన సంబరంగా కలిసి వేసిన అడుగులు..
నాడు అలల తాకిడికి చెదిరినా నేడు ఇష్టమై పలకరించే స్వప్నాలే!
ప్రియమైన నీ ఒడిలో తలవాల్చి వెచ్చని చెలిమి కౌగిళ్ళలో జతగా నీ నేను..!
అలికిడి లేకుండా నిశ్శబ్దంగా కదులుతున్న కాలం..
కమ్మని ఊహల ఊయలలో ఊరేగిస్తుంటుంది!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.