[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘కాలంతో కాసేపు!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నేనున్నంతవరకు
నాకు తెలియదు
కట్టి మొద్దు అగ్ని(తో)
తనువుకు చాలా
బంధం ఉందని.
ఎవరో అన్నారు కానీ
నేను నమ్మలేదు
నాకు వచ్చినప్పుడు
తెలిసింది..
ఆత్మగా చూసిన
ప్రయోజనం లేదుగా
ఇది అంత
జగన్నాటకం..
సృష్టి మొత్తం
నాటక ప్రపంచమని
తెలియదు..
పడిగాపులు
కాచే జీవితాలు
మనవి
ఎందుకు
మాట మాటకు
పోట్లాటలు,
పని చేస్తేనే ఆ రోజుకి
ఆహారం తీరిందనుకుంటాము
నేనున్నంతవరకు
తెలీదు జీవితం అంటే
ఒక ప్రదర్శన లాంటిదని..
ఎవరైన ఉన్నప్పుడు
పలకరించరు తనువు
మనతో లేనప్పుడు
ఏడుపులు,
వావోపులు ఇవన్ని
నాకు వద్దు అసలే
నా మనస్సు చిన్నది
కాస్త వచ్చిన వల్లనైనా
పలకరించండి..
వెళ్లోస్తాను స్నేహమా
(ఈ) ప్రదర్శన, జీవనం చాలు
ప్రకృతిని వ్యర్థ
పదార్థాలతో నింపేస్తున్నారు
కాస్త నిషేధించండి..
నేను వెళ్ళను
మీ హృదయాలలో
గలిగుంటాను
స్వస్థలంలో ప్రకృతిగా
వ్యాపిస్తాను..
గిద్దలూరు సాయి కిషోర్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, రాయదుర్గంకు చెందినవారు. మురళి, లక్ష్మి గార్లు ఆయన తల్లిదండ్రులు. సాయి కిషోర్కు చెల్లెలు ఉంది.
కవితలు, కథలు రాయడం అంటే సాయి కిషోర్కు చాలా ఇష్టం. అలాగే కవితల, కథల పోటీలకు పాల్గొనడం ఇష్టం.
సాయి కిషోర్కు కథలు, కవితలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీరు రచించిన కవితలు మైండ్ మీడియాలో కవితా ఝరి కార్యక్రమంలో అనేక మార్లు ప్రసారమయ్యాయి. త్వరలో ప్రచురితమవబోతున్న వీరి మొదటి కవితా సంపుటి పేరు ‘జీవనం’.