Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘జీవన సౌరభాలు’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి గారి పద్య కవితా సంపుటి ‘జీవన సౌరభాలు’ ఆవిష్కరణ సభ జూన్ 15 ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాలకు విజయవాడలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ మీటింగ్ హాల్లో జరుగుతుంది.

కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత జరిగే సభలో ‘జీవన సౌరభాలు’ను అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరిస్తారు. డాక్టర్  గుమ్మ సాంబశివరావు పుస్తక సమీక్ష చేస్తారు.

ప్రముఖ వైద్యులు, రచయిత డాక్టర్ జీ.వి. పూర్ణచందు  గౌరవ అతిథిగా పాల్గొంటారు.

– రచయిత్రి డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి తరఫున
చలపాక ప్రకాష్. (కార్యక్రమ నిర్వాహకుడు).
సెల్ నెంబర్: 9247475975

Exit mobile version