సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    సుగుణ అల్లాణి

    చాలా బాగుంది సర్ ఇంటర్వ్యూ !! ఉత్తమ సాహితీవేత్తల పరిచయం మా లాంటివారికెందరికో మార్గదర్శకమౌతుంది 🙏

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ రాసాని పక్షాన
      మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    డా. రాసాని వృత్తి, ప్రవృత్తి తెలుగు సాహిత్యమే కాబట్టి, చిన్నతనం నుండి ఏదో ఒక ప్రక్రియ లో రాస్తూ ఉండడం వల్ల ఆ కలం పదునెక్కింది. కథలు, నాటకాలు, నవలలు విరివిగా రాస్తూ, అవార్డుల విషయం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళే ఒక అరుదైన రచయిత రాసాని.
    ఇటీవల ఒక పోటీ కి వచ్చిన నవలలను పరిశీలించే అవకాశం కలిగింది. డా. రాసాని “వొలికలబీడు” కి రెండో ఆలోచన లేకుండా అవార్డు ప్రకటించాను. చాలామంది కి చెప్పాను, చర్చించాను ఒక అద్భుతమైన నవల అని, చదవమని.
    “వొలికలబీడు” అంటే స్మశానం. జన్మనెత్తిన ప్రతివాడూ చివరకు చేరాల్సిన ప్రదేశం వొలికలబీడు. శవాలను కాల్చే, పూడ్చే కాటికాపరుల జీవితగాధను ఇతివృత్తం గా తీసుకుని నవల ఎవరూ రాయలేదు. అటువంటి ఎంతో పవిత్రమైన కార్యం నిర్వహిస్తున్నా “అంటరాని వాడు” గా ఛీత్కారాలు ఎదుర్కొంటున్న వాడి దీనమైన జీవితం… కాల్చడంలోని విధానాలు, కపాల మోక్షం … వివరంగా రాశారు రాసాని. పూడ్చడం లోనూ స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు వేరే. శ్రీ వైష్ణవుడైన గురువుకు వేరే విధం. ఎక్కడా జుగుప్స కలగకుండా రాసారు రచయిత. కాటికాపరుల బతుకుల మీద కూడా రాజకీయ, కార్పొరేట్ కాకులు వాలడం ఎంత దుర్మార్గం!
    కాటికాపరులని పేరు పెట్టి ఎవరు పిలవరు. వాడు, వీడు, ఒరేయ్… అంతే. చచ్చిన తర్వాత కూడా కర్మకాండలకి బేరమాడే వారు కూడా ఉండడం దౌర్భాగ్యం, ఆశ్చర్యం.
    శవం రాని రోజు వీరికి పస్తే. అప్పుడు వీళ్ళు వీధిలో ‘కనికట్టు’ విద్య ప్రదర్శించి, జనం విసిరిన డబ్బులతో కడుపు నింపుకుంటారు.
    నవలలో వారి జీవన విధానం మాత్రమే రాస్తే ఆ “దాసు” పాత్ర గొప్పగా నిలిచిపోయేది కాదు. తల్లి దహనక్రియ అయ్యాక అనాధగా ఏడుస్తున్న ఒక పిల్లాడిని చేరదీసి తన పిల్లవాడితో సమానంగా పెంచుతాడు దాసు. చచ్చిపోయింది అని హాస్పిటల్ వారు పంపిన ఆడ శిశువును కూడా తాను పెంచుతాడు. మరో విషయం- రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లని “మాతంగి”ని చేసినట్టు, మొక్కుకుని మగ పిల్లవాడిని దేవుడికి అప్పగిస్తూ “ఉల్లిగమ్మ” గా చేస్తారు. వాడు నెలలో కొన్ని రోజులు చీర కట్టుకోవాలి. జీవితమంతా అడుక్కు తినాలి. మనలాంటి వారికి తెలియని ఎన్నో చీకటి కోణాలు, మన సమాజంలో ఎన్నో దురాచారాలు. నవలా రచనను హాబీగా ఆషామాషీ గా తీసుకోరని రాసాని రాసిన నవలలను చూస్తే తెలుస్తుంది. తాను స్వీకరించిన ప్రతి సబ్జెక్టునూ ఎంతో పరిశోధించి, మనసు పెట్టి రాస్తారు. ముఖ్యంగా ఏ రచయిత తీసుకొని సబ్జెక్టు వొలికల బీడు ఇతివృత్తాన్ని తీసుకొని, పరిశోధించి ఆద్యంతం చిత్తూరు మాండలికం లో రాసిన డాక్టర్ రాసాని కి హృదయపూర్వక అభినందనలు.

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈ నవలని చదివిన రెండు నెలల క్రితం వరకూ, అడపాదడపా కొన్ని కథలు చదవడం తప్ప డా. రాసాని వి.ఆర్. ఎవరో నాకు తెలీదు.
    కేవలం తన ‘అక్షరం’ ద్వారా గుర్తింపు పొందడం కంటే ఒక రచయిత కు పెద్ద అవార్డు ఏముంటుంది!

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ రాసాని పక్షాన
      ధన్యవాదాలు.

  4. 4

    గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    చాలా మంచి ఇంటర్వ్యూ.. రచయిత నిర్మొహమాటంగా సాహిత్యరంగంలోని రుగ్మతలు గురించి చెప్పటం చాలా బాగుంది.అవార్డుల ప్రస్తావన కొంత తగ్గించి, పరిశోధన విషయంగా కూడా రచయిత అభిప్రాయాలను రికార్డ్ చేసి ఉంటే బాగుండేది..
    డా. రాసాని గారిని, ఇంటర్వ్యూ చేసిన డా. ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!