10/05/2025 న నెల్లూరులోని ఎస్.ఆర్.కె విశ్వసాయి స్కూల్లో జరిగిన సాహితీ కార్యక్రమంలో తిరుపతి రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజుకు గోవిందరాజు సీతాదేవి సాహితీ పురస్కారం అందజేశారు.
ఆయన రచించిన ‘మేకల బండ’ నవలకు గానూ ఈ నవలా పురస్కారం లభించింది.
గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సుభద్రదేవిగారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో రచయితలు డాక్టర్ సుంకర గోపాల్, అద్దేపల్లి ప్రభు, డాక్టర్ పెళ్లూరు సునీల్, శ్రీమతి గాయత్రి, కె.ఎ. ముని సురేష్ పిళ్లే, పేట యుగంధర్, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు.