[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘గెలవడానికి పోరాడాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మోసపూరిత
మనషులు మన
చుట్టూ వుండటం
బలవంతమైన బంధం లాంటిది
కక్షపూరిత
మనసులు మన
ప్రక్కన ఉండటం
పక్కలో బల్లెం లాంటిది
నవ్వుతూ ఏడ్చే వాళ్ళు..
ఏడుస్తూ నవ్వే వాళ్ళు
చాలా మంది ఉంటారు..
వీళ్ళు బ్రతుకు
ఈడవడానికి
అలవాటు పడిన వాళ్ళు..
గెలవడానికి పోరాడేవాడు
ఒక్కడే వుంటాడు
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.