Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం మార్చి 2025

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలని ‘సంచిక’ నిరంతరం ప్రయత్నిస్తోంది.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా ‘సంచిక’ ప్రకటించిన పద్యకావ్యాలు, వచనకవితల పోటీ గడువు ముగిసింది. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీని మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు, ‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీని శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఫలితాలు ఉగాది పండుగ రోజున వెల్లడవుతాయి.

‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలవుతున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము. ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మార్చి 2025 సంచిక.

1 మార్చి 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

భక్తి:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

~

English Section:

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version