Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం ఏప్రిల్ 2025

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు.

విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ కృషి కొనసాగుతోంది.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా ‘సంచిక’ ప్రకటించిన పద్యకావ్యాలు, వచనకవితల పోటీ ఫలితాలు వెలవడ్డాయి. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీకి శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు, ‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీకి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. బహుమతి నగదును విజేతలకు పంపడమైనది.

ఈ సందర్భంగా ‘సంచిక’ త్వరలో మరో పోటీని ప్రకటించనున్నది. వివరాలు రాబోయే సంచికలో.

విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలయ్యే ‘సంచిక’ రచనలు చదువరులకు ఆసక్తి గొల్పుతున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము. ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరియం, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఏప్రిల్ 2025 సంచిక.

1 ఏప్రిల్ 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

~

English Section:

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version