తిరుపతి జిల్లా, బాకరాపేట ప్రాథమిక వైద్యశాలలోని ఆయుష్ విభాగంలో సీనియర్ హోమియో డాక్టర్గా 17 సంవత్సరాలు పాటు వైద్యసేవలందించిన డా. కె. ఉమాదేవి ఈ నెలలో ఉద్యోగం విరమణ చేస్తున్న సందర్భంగా వైద్య కేంద్ర సిబ్బంది అధ్వర్యంలో వీడ్కోలు సన్మాన సభ చాలా వేడుగ్గా జరిగింది.
మితభాషి అయిన ఉమాదేవి గారు రోగులకు చేసిన వైద్యసేవలు గొప్పవనీ, వారు వైద్యురాలిగానే గాక ప్రసిద్దమైన పత్రికా రచయిత్రి అని కూడా ఎందరో అభినందించారు. స్త్రీల వ్యాధులు హోమియో వైద్యం, స్త్రీ శరీర విజ్ఞానం, హోమియో వైద్యం,ఇన్షెక్షన్స్, కోవిడ్ నివారణ, పిల్లల పెంపకం వంటి ఆమె గ్రంధాలు ముద్రించారు. వారు వార్త, ఆంధ్రజ్యోతి, ఆహ్వానం,విశాలాంధ్ర లాంటి పత్రికల్లో వైద్యపరమైన వ్యాస సీర్షికలు కూడా నిర్వహించారు. ఎన్నోవందల మెడికల్ క్యాంపులు కూడా వారు నిర్వహించారు.
అక్కడి ఇతర వైద్యాధికారులైన డా. హేమంత్ కుమార్ రెడ్డి, డా. తేజస్వి గారి అధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన సభలో అక్కడి సిబ్బందే గాక, మరికొందరు స్థానికులు, స్థానికేతరులు కూడా పాల్గొని ఉమాదేవి గారి సేవల్ని కొనియాడారు.
ఎం.ఇ.ఓ.ఎన్ లింగయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా:ఎం.నరసింహులు, సీనియర్ అధ్యాపకులు డా. కె.రెడ్డప్ప, ఇంకా డా. అలెగ్జాండర్, అయిల శ్రీదేవి, నిరంజన్ రెడ్డి, ఆయుష్ సిబ్బంది డా. రాజేశ్వరీ, సఫీ, కళావతి మొదలైనవారు పాల్గొని ఉమాదేవి గారి సిన్సియారిటీని, వారి గొప్ప వ్యక్తిత్వాన్ని వేనోళ్ల పొగిడారు.
ఇదే సభలో సుప్రసిద్ధ కథా, నవలా రచయిత అయిన డా:వి.ఆర్.రాసాని కూడా పాల్గొనడం విశేషం. ఆ సభకు విచ్చేసిన చాలామంది ఉమాదేవి దంపతులను ఘనంగా సన్మానించారు.