[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
అయ్యలరాజు కవితా వైభవం
నిజానికి, శ్రీకృష్ణదేవరాయల అనంతర కాలంలో అళియ రామరాయని మేనల్లుడు గొబ్బూరి నరసరాజు ఆస్థానమున అయ్యలరాజు రామభద్రుడు కవిగా వెలుగొందినాడు. నరసరాజునకు క్రీ.శ. 1550 ప్రాంతమున రామభద్రుడు తన రామాభ్యుదయ ప్రబంధమును అంకితము ఇచ్చాడు. ఈ విషయాన్ని అయ్యలరాజు కవితారీతులపై పరిశోధన చేసి 1974 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి Ph.D పొందిన డా. కొత్తపల్లి విశ్వేశ్వర శాస్త్రి గారు నిరూపించారు.
ఈ పుస్తకంలో, రామభద్ర కవి రామాభ్యుదయం లోని కొన్ని మంచి పద్యాలను ఏరి, వాటిలోని సొగసులను పరిచయం చేశారు శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు. ఈ పుస్తకాన్ని చదవదలచిన వారు క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఉచితంగానే చదువుకోవచ్చు.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.