మది అంతరంగంలో మెదిలే
కోరికలు కొన్ని
అక్షరాలుగా మారి
లక్ష్యాలై కళ్ళముందు కదులుతుంటే
కవితలై సాక్ష్యాత్కరిస్తుంటే
కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటాను !
కోరికలు, కవితలు, కలలన్నీ కమనీయ కావ్యాలై ..
రమణీయ రూపాన్ని సంతరించుకుని..
అందమైన దృశ్యకావ్యంలా.. భావాల వర్ణాలెన్నో మేలుకలయికలతో..
నయనానందకరమై.. ముగ్ధమనోహరమై ..
ఆహ్లాదాన్ని పంచాలనుకుంటూ పరితపిస్తుంటాను !
కలం కదలికలు ..
కమనీయం.. రమణీయం ..
అక్షరాల చిత్రాలు.. కవితా కుసుమాలైన.. అపురూపనేస్తాలు !
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.