Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ – కొత్త అనువాద ధారావాహిక ప్రారంభం – ప్రకటన

ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన Harina Pithire Ajana Surjyatha Ku అనే నవలకి తెలుగు అనువాదం ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’.

హృశికేశ్ పాండా గారి సమగ్ర సాహిత్యాన్ని తెలుగులోకి తెస్తున్న క్రమంలో శ్రీమతి స్వాతి శ్రీపాద ఈ నవలని అనువదించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల నాటి కథ ఇది.

పరిస్థితులతో ఎదురొడ్డి పోరాడుతూ, ఓడిపోతూ, సర్దుబాటు చేసుకొంటూ, గెలిచినట్లుగా భ్రమిస్తూ బతికే జీవితాల గురించి విశ్లేషిస్తూ, ఆ పోరాటాలు, ఓటములు, గెలుపులు వాళ్ల చేతుల్లో ఏమీ లేవనీ, రాజకీయ భూస్వామ్య వ్యాపార సంబంధ పెద్ద మనుషులు ఆడుకునే క్రీడల్లో ఒక భాగమనీ వ్యంగ్యంగా చెబుతూ పాఠకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తారు హృశికేశ్ పాండా.

ఈ నవలలో కుంతి అనే దిగువ మధ్యతరగతి ఆడపిల్ల గురించి కథ చెప్పినప్పటికీ, చుట్టూ జరిగే సామాజిక విధ్వంసాన్ని కూడా కథలో భాగం చేశారు.

కుంతిని జీవితాంతం ప్రేమరాహిత్యం వెంటాడుతుంది. జీవితంలో ఏదో పోగొట్టుకొంది. ఊహల్లో కనిపించే అద్భుతం తాలూకు స్పర్శను అందుకొనేందుకు జీవితం చివరిదాకా దాన్ని వెతుకుతూనే వుంటుంది. అద్భుతం ఒకటి వచ్చి తలుపు తడుతుందేమోనని అనుక్షణం నిరీక్షిస్తూ వుంటుంది కుంతి. కానీ తననుకుంటున్న ఏ అద్భుతమూ ఎదురుగాక పోవడం చాలా బాధాకరం.

సమాజానికి అపరిచితలా మిగిలిపోయిన అడవి అంచు నేలలాగే ఆమె కూడా అందరికీ అపరిచిత అవుతుంది.

నవల పూర్తిగా చదివేసరికి పాఠకుడికి అర్థమవుతుంది – ఆమె జీవితం మీద గాని, ఏటితో కూడిన ఆ నేల మీద గాని అద్భుతాలు ఏమీ జరగలేదనీ, జరగబోవనీ.

గాఢమైన అనుభూతిని మిగిల్చే నవల ఇది.

***

వచ్చే వారం నుంచే ప్రారంభం

చదవండి.. చదివించండి

‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’.

Exit mobile version