[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘అమ్మంటే తెలుసుకో.. జన్మంతా కొలుచుకో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అమ్మంటే అనురాగానికి ప్రతిరూపం!
అమ్మ.. పండువెన్నెల్లో గోరుముద్దలు పెట్టే
ఆత్మీయ అనుబంధం!
అటలాడే వేళ
జాగ్రర్త లెన్నో చెప్పే ఉత్తమ అనురాగం!
ఏమరపాటుగా ఉన్నప్పుడు
గాయమేదైనా అయితే
తనకే తగిలినంతగా విలవిలలాడుతూ
బాధపడుతూ ఓదార్చే నేస్తం!
చదువుల్లో వచ్చే సందేహాలు తీర్చేవాళ
తాను గురువులా మారుతూ
మన గెలుపుకై కృషిచేసే
మహోన్నత మానవతామూర్తి!
తన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ..
సంఘంలో గౌరవ మర్యాదలు మన్ననలు అందుకునేలా..
శిలను శిల్పంగా మార్చే స్థపతి తాను!
అమ్మ.. ఔన్నత్యం ఎంతగా చెప్పినా.. వ్రాసినా తక్కువే!
అందుకే మనమంతా
నిత్యం తలచుకోవాలి.. తెలుసుకోవాలి..
అమ్మ నేలపై మనకోసమే
జన్మించిన అపురూపమైన దేవత!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.