Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 262

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

విలక్షణ నటుడు ప్రాణ్:

ఆరు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో రొమాంటిక్ హీరోల నుండి బలమైన విలన్‌ల వరకు, ఆకట్టుకునే సహాయక పాత్రల వరకు వివిధ పాత్రలలో ప్రావీణ్యం ప్రదర్శించిన విలక్షణ నటుడు ప్రాణ్. అయితే, తను నటించిన విలన్ పాత్రల ద్వారానే ఆయన తనకంటూ ప్రత్యేకతని సృష్టించుకున్నారు, భారతీయ సినీరంగపు అత్యంత ప్రసిద్ధ విలన్‌లలో ఒకరిగా నిలిచారు.

1920 ఫిబ్రవరి 12న లాహోర్‌లో జన్మించిన ప్రాణ్, సంపన్న పంజాబీ హిందూ కుటుంబం నుండి వచ్చారు. అయితే, ఆయన బాల్యం పాత ఢిల్లీలోని బల్లిమారన్‌లో గడిచింది. ఆయన తండ్రి కేవల్ కృష్ణ సికంద్ అహ్లువాలియా సివిల్ కాంట్రాక్టర్, ఇంజనీర్‌గా పనిచేశారు, తల్లి రామేశ్వరి అహ్లువాలియా అంకితభావం గల గృహిణి. ప్రాణ్ చదువులలో, ముఖ్యంగా గణితంలో విశేషంగా రాణించి, అసాధారణ ప్రతిభను కనబరిచారు.

ఉద్యోగ రీత్యా వారి తండ్రికి తరచూ బదిలీలు అవడం వల్ల, ప్రాణ్ -డెహ్రాడూన్, లాహోర్, కపుర్తలా, మీరట్, ఉన్నావ్ వంటి వివిధ నగరాల్లోని పాఠశాలలలో చదివారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని హమీద్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.

మొదట్లో, ఆయన కలలకు వెండితెరతో సంబంధం లేదు – ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఆకాంక్షించారు, ఈ ఆశయాన్ని కొనసాగించడానికి ఢిల్లీలోని ఎ. దాస్ & కో అనే కంపెనీలో అప్రెంటిస్‌గా చేరారు.

అయితే, విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. 1940లో, లాహోర్‌లోని ఒక దుకాణంలో రచయిత వాలి మొహమ్మద్ వాలితో జరిగిన ఒక యాదృచ్ఛిక పరిచయం, దల్సుఖ్ ఎం పంచోలి దర్శకత్వం వహించిన పంజాబీ చిత్రం యమ్లా జాట్‌లో నటించేలా చేసి, ప్రాణ్ సినీరంగ ప్రవేశానికి దారితీసింది.

దేశ విభజనకు ముందే, ప్రాణ్ తన ప్రతిభను చాటుకుంటూ 22 సినిమాలతో, వెండితెరపై ఒక బలమైన విలన్‌గా స్థిరపడ్డారు. అయితే, 1947లో జరిగిన పరిణామం అన్నింటినీ మార్చేసింది.

భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో, ప్రాణ్ లాహోర్ వదిలి ముంబైకి రావాల్సి వచ్చింది, తాత్కాలికంగా అవకాశాలు తగ్గాయి. వేషాలు దొరక్క ఇబ్బంది పడుతూ, ఎనిమిది నెలల పాటు మెరైన్ డ్రైవ్‌లోని డెల్మార్ హోటల్‌లో పనిచేయడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు.

ఆ తర్వాత, 1948లో, ఆయనకి అదృష్టం కలిసి వచ్చింది. రచయిత సాదత్ హసన్ మాంటో, నటుడు శ్యామ్ మద్దతుతో, దేవ్ ఆనంద్, కామిని కౌశల్ నటించిన బాంబే టాకీస్ చిత్రం ‘జిద్ది’లో ఆయనకి ఒక పాత్ర లభించింది. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఆయన అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికింది.

1950ల నాటికి, ప్రాణ్ తనను తాను విలన్ పాత్రలో బలంగా నిలబెట్టుకున్నారు, దశాబ్దాల పాటు ఆ హోదాను కొనసాగించారు. కాలక్రమేణా, పరిశ్రమలో అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలురైన నటులలో ఒకరిగా ఎదిగారు.

సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు అనేక పురస్కారాలు లభించాయి, వాటిల్లో ఉత్తమ సహాయ నటుడిగా మూడు ఫిలింఫేర్ అవార్డులు, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం (1997), పద్మ భూషణ్ (2001), ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2013) ఉన్నాయి. తన కెరీర్ మొత్తంలో, ఆయన 350 కి పైగా చిత్రాలలో నటించి, భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు.

ప్రాణ్ కెరీర్‍ని ప్రభావితం చేసిన కొన్ని సినిమాలు:

పూరబ్ ఔర్ పశ్చిమ్:

ఈ సినిమాలో ప్రాణ్ ఓ స్వాతంత్ర్య సమరయోధుడిని మోసం చేసే హర్నామ్ అనే ఆధునికుడి పాత్రను పోషించారు. అయితే, స్వాతంత్ర్య సమరయోధుడు ఓంను బ్రిటిష్ పోలీసులు చంపినప్పుడు విషాదం చెలరేగి హర్నామ్ కుటుంబం ఛిన్నాభిన్నమవుతుంది.

జిస్ దేశ్ మే గంగా బెహతీ హై:

ఈ సినిమాలో భయంకరమైన బందిపోటు రాకా పాత్రలో ఆయన పోషించిన పాత్ర మరపురానిది. రాజ్ కపూర్‌తో కలిసి తెరను పంచుకున్న ప్రాణ్, ఆ పాత్రకు మరింత గాఢతను జోడించి, బాలీవుడ్ గొప్ప విలన్‍గా తన ఖ్యాతిని పదిలం చేసుకున్నారు.

ఉపకార్:

ఈ సినిమాలో ప్రాణ్, విలన్‍గా కాకుండా, మంచి మనసున్న, వికలాంగుడైన రైతు మంగళ్ చాచా పాత్రను పోషించారు. తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే “కస్మే వాదే ప్యార్ వఫా” పాటకు కూడా తన గాత్రాన్ని అందించారు.

పరిచయ్:

గుల్జార్ ఓ బెంగాలీ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో, ప్రాణ్ – రాజ్ సాహెబ్ అనే కఠినమైన, గౌరవప్రదమైన పితృస్వామ్య పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు, సానుకూల పాత్రల్లోకి సజావుగా మారగల తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

జంజీర్:

ఈ సినిమాలో ప్రాణ్ నటించిన షేర్ ఖాన్ పాత్ర ఒక సహాయక పాత్ర కంటే ఎక్కువ – అది ఓ దిగ్గజ పాత్రగా మారింది. అమితాబ్ బచ్చన్ పోషించిన విజయ్ పాత్రతో, షేర్ ఖాన్ స్నేహం బాలీవుడ్ చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణంగా మిగిలిపోయింది.

పత్థర్ కే సనమ్:

ఈ సినిమాలో, బలమైన లాలా భగత్ రామ్‌గా ప్రాణ్ మరపురాని సంభాషణలను అందించారు, “క్యోం? ఠీక్ హై నా, ఠీక్?” అనేది మంచి ఉదాహరణ.

హాఫ్ టికెట్:

ఈ సినిమాలో స్మగ్లర్ రాజా బాబు పాత్రలో ప్రాణ్ – ‘ఆకే సీధీ లగీ మేరే దిల్ పే కటారియా’ పాటలో కిషోర్ కుమార్ పాత్రతో హాస్యం పండించారు, ఇది బాలీవుడ్‌లో అత్యంత గుర్తుండిపోయే హాస్య సన్నివేశాలలో ఒకటిగా నిలిచింది.

హీర్ రాంఝా:

ఈ గొప్ప ప్రేమకథలో ప్రాణ్ – దుష్ట, కాటుక కళ్ళ మామ పాత్రను పోషించడం ఈ చిత్రం యొక్క విషాదకరమైన ముగింపులో కీలక పాత్ర పోషించింది.

కలకాలం నిలిచే ప్రాణ్ డైలాగులు కొన్ని:

సనమ్ బేవఫా (1991):

“అన్‍జామ్ ఉన్కా వహీ హోగా జో తు చాహ్తా హో.. లేకిన్ హోగా వైసే జైసే హమ్ చాహ్తే హైఁ”

జఖ్మ్ (1973):

“జఖ్మ్ దేనేవాలా బీ వోహీ హై, భర్నే వాలా బీ వో హీ హై.. ఇన్‍సాఫ్‌ తో సిర్ఫ్ మర్హమ్ రగద్ సక్తా హై. ”

షరాబి (1984):

“ఆజ్ కీ దునియా మే అగర్ జిందా రహెనా హై తో దునియా కా బటన్ అప్నే హాథ్ మే రఖ్‍నా పడ్తా హై.”

కర్జ్ (1980):

“కర్జ్ చుకానే వాలే కీ యాద్దష్త్ అగర్ కమ్‍జోర్ హో జాతీ హై..”

డాన్ (1978):

“జీ చాహ్తా హై తుఝే గంధే కీడే కీ తరహ్ మసాల్ దూఁ, మగర్ మై అప్నే హథ్ గంధే కర్నా నహీ చాహ్తా.”

గంగా కీ సౌగంద్ (1978):

“జుల్మ్ కర్నే వాలా భీ పాపీ హై, జుల్మ్ సహనే వాలా భీ పాపీ”

జంజీర్ (1973):

“ఇస్ ఇలాకే మే నయే ఆయే హో సాహబ్?.. వర్నా షేర్ ఖాన్‌ కో కౌన్ నహీ జాన్తా?”

హీర్ రాంఝా (1970):

“ఖుచల్ దూంగా, మసల్ దూంగా, జలా దూంగా, లుటా దూంగా.. రులాయా ముఝ్‍కో కిస్మత్ నే.. మై దునియా కో రులా దూంగా.”

ఉపకార్ (1967):

“జిందగీమే సిర్ఫ్ చాధ్‍తే కీ పూజా మత్ కర్నా, దూభ్‍తే కీ భీ సోచ్నా”

కర్జ్ (1980):

“ముసల్మాన్ కే యహాఁ పర్వరిష్, హిందూవోం సే దోస్తీ ఔర్ అంగ్రేజోం సే షౌంక్ రహే హై మేరే.”

~

ప్రాణ్ ప్రతిభ కేవలం ఆయన పోషించిన పాత్రలలోనే కాదు, ప్రతి పాత్రకూ ఆయన అందించిన నిండుదనంలో ఉంది. వణుకు పుట్టించే విలన్‍ పాత్రల నుండి హృదయాన్ని తాకే తండ్రి పాత్రల వరకు, ఆయన బహుముఖ ప్రజ్ఞ సాటిలేనిది. నేటికీ, ఆయనను తలచుకోగానే, వారికి లభించిన ప్రశంసలు, గౌరవం గుర్తొస్తాయి, ఇది భారతీయ సినిమాకు ఆయన చేసిన గొప్ప కృషికి రుజువు.

Exit mobile version